Friday, December 19, 2008

మరణ లేఖలు

ఈ మద్య చదివిన కధలలో సాక్షి వార పత్రికలో వచ్చిన మరణ లేఖలు చాలా నచ్చింది. ఈ కధ నవంబరు 2 వ తారీఖున ఫండే లో వచ్చింది.ఈ కథలో చివరన ఈ కవిత చాలా బాగుంది. అందుకే ఇక్కడ రాస్తున్నాను.
వాంఛ - పవిత్రత,
స్వేఛ్ఛ - అణచివేత,
శాంతి - హింస,
వ్యక్తివాదం - సమిస్టితత్వం
పరస్పర విరుద్దమైన భావాలన్నీ
మనలోనే వున్నప్పుడు
ఆదర్శాలు - వాస్తవాల మద్య అగాధం పెరిగినప్పుడు
మనతో మనమే విభేదించినప్పుడు
స్థిమితంగా ఉన్నవాడు మనిషిలా బతుకుతాడు!
లేనివాడు దేవుడైపోతాడు!!
--పూడూరి రాజిరెడ్డి

No comments: